
సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు పారదర్శకతకు పాతర వేశారు. అసలు ఖాళీలు చూపించకుండానే నిర్వహించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని యూఎల్బీస్(అర్బన్ లోకల్ బాడీస్) అయిన గుంటూరు నగరపాలక సంస్థ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీల్లో పరిధిలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన శనివారం మందిరంలో జరిగింది. ఇందులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఉన్నారు.
పారదర్శకతకు పాతర
మామూలుగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఖాళీలను బట్టి నడుస్తుంది. ముందుగా దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజెడ్, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత సీనియార్టీ, ర్యాంక్ని బట్టి ఉంటుంది. అయితే, అధికారులు ఇవేమి పాటించలేదు. సచివాలయ వివరాలను మూడు ఆప్షన్స్గా చూపించి, ఫారం ఫిల్ చేసి ఇచ్చేసి వెళ్లిపోండంటూ చెప్పడంతో ఉద్యోగులు విస్తుపోయారు. ఈ నెల 30వ తేదీలోగా అలాట్ అయిన సచివాలయానికి సంబంధించిన పోస్టింగ్ కేటాయిస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. అసలు తాము ఇచ్చిన ఆప్షన్స్ ఫాం అయిన ఉంటుందా ? లేక చెత్త బుట్టలో వేస్తారో ! అని ఒకింత అనుమానం వ్యక్తం చేశారు.
వార్డు టూ వార్డు ట్రాన్స్ఫర్లపై మండిపాటు
వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే ట్రాన్ఫర్ అయ్యే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా యూఎల్బీ టూ యూఎల్బీ(అర్బన్ లోకల్ బాడీ)కు ట్రాన్ఫర్ చేసుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని కొంత మంది మహిళా సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. వార్డు టూ వార్డు పెట్టుకోవడం ద్వారా ఇంకా దాన్ని ట్రాన్ఫర్లు అనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఖాళీలు చూపించకుండా బదిలీలు ప్రక్రియ చేపట్టిన అధికారులు ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోవాలని సూచన 30న సచివాలయం ఎలాట్మెంటు అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల మండిపాటు
ఎమ్మెల్యేల లెటర్లకే ప్రాధాన్యత ?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు జరిగింది. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు 11,082(అర్బన్, రూరల్లకు కలిపి) మంది సెక్రటరీలు ఎంపికయ్యారు. వీరిలో మొదటి బ్యాచ్కు పోస్టింగ్స్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, పలువురు ఒకే సచివాలయానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫార్సుల లెటర్లు తీసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లే ఆధారంగా బదిలీలు జరిగే అవకాశం ఉందంటూ కొంత మంది సీనియర్ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారో ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు మిన్నకుండిపోయారు.

సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’