ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం

Jun 29 2025 2:46 AM | Updated on Jun 29 2025 2:46 AM

ప్రైవ

ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే 20 శాతం నుంచి 30 శాతం మేరకు పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.18 నుంచి 20 వేల మధ్యలో ఉండగా, కార్పొరేట్‌ స్కూల్లో అది రూ. 28 వేలుగా ఉంది. కార్పొరేట్‌ పాఠశాలలో 6వ తరగతికి రూ.35 వేలు, టెన్త్‌కు రూ.40వేలు వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్‌ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60వేలు, టెన్త్‌కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.

పబ్లిషర్లతో డీల్‌

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టేశాయి. ప్రైవేటు పబ్లిషర్లతో డీల్‌ కుదర్చుకుని, ఎమ్మార్పీలకు ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్సులు విక్రయిస్తున్నాయి. వీటితో పాటు యూనిఫాం, బెల్టు, టై సహా అన్నీ వారి దగ్గరే తల్లిదండ్రులు కొనాలి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని, యూనిఫాంను ఫలానా దుకాణంలో కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి.

నాణ్యమైన విద్య..మిథ్య

ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధన జరిగాలి. అయితే, ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్య పుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నాయి. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ద్వారానే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ, వాటిని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం తూట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోఽధిస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడించింది. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాల హెచ్‌ఎం, ప్రిన్సిపాల్‌ లాగిన్‌ ద్వారా క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో పుస్తకాలకు ఆర్డర్‌ పెట్టాలి. పుస్తకాలను కొనుగోలు చేసే విధానాన్ని విద్యాశాఖాధికారులు పక్కాగా పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆన్‌లైన్‌ విధానానికి స్విస్తి పలకడంతో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 637 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఉండగా, అధిక లాభాలను ఆర్జించిపెట్టే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలనే విక్రయిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ అకడమిక్‌ కేలండర్‌కు విరుద్ధ్దంగా సొంత సిలబస్‌ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఏటా పెరుగుతున్న ఫీజులు నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు పుస్తకాలు, యూనిఫాం కొనడానికి అప్పులు క్యాంపస్‌లలోనే యథేచ్ఛగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తక విక్రయాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే బోధించాలనే నిబంధనకు తూట్లు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను కొనుగోలు తప్పనిసరి చేసిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానంతో విద్యాశాఖాధికారులతో పర్యవేక్షణ

ఇష్టారాజ్యంగా ఫీజులు

పెంచేందుకు వీల్లేదు

ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం 1
1/2

ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం

ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం 2
2/2

ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement