పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ

Jun 29 2025 2:46 AM | Updated on Jun 29 2025 2:46 AM

పవర్‌

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ

మంగళగిరి టౌన్‌ : జాతీయ స్థాయిలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం దావన్‌గిరిలో జరుగుతున్న జూనియర్‌ నేషనల్‌ ఎక్యూప్ట్‌ ఉమెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్‌ సందాని శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్‌ షబీనా 84 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. స్క్వాట్‌ 202.5 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌ 97.5 కిలోలు, డెడ్‌ లిఫ్ట్‌ 182.5 కిలోలు, ఓవరాల్‌ 482.5 కిలోల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఉద్యోగుల

సస్పెన్షన్‌పై విచారణ

నాదెండ్ల: గణపవరం గ్రామీణ పశువైద్యశాల వైద్యాధికారి సాంబశివారెడ్డి, వెటర్నటీ లైవ్‌స్టాక్‌ సిబ్బంది పవన్‌కుమార్‌ ఇటీవల సస్పెండ్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయమై పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఈ నెల 19న 3.30 గంటల సమయంలో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సి. రాజశేఖర్‌ గణపవరం పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వైద్యాధికారి సాంబశివారెడ్డి, సిబ్బంది పవన్‌కుమార్‌ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్‌ చేశారు. దీనిపై శనివారం డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు రికార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. స్థానిక పశుపోషకులను విచారించారు. వైద్యాధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఇళ్లకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మేదరమెట్ల అంజమ్మ, మస్తాన్‌రావు విద్యాసంస్థల చైర్మన్‌ ఎంవీ శేషగిరిరావు, అనంతలక్ష్మి దంపతులు విరాళంగా రూ.3 లక్షలు అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఈవో నలబోతు మాధవిదేవిని కలిసి విరాళం చెక్‌ను దాతలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ పాల్గొన్నారు.

అమ్మవారికి ఆషాఢ సారె

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : గుంటూరు ఎస్‌వీఎన్‌ కాలనీ లోని పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామి వారి దేవస్థాన భక్త బృందం శనివారం అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. కోలాట ప్రదర్శన చేస్తూ ఆలయానికి చేరుకుని సారె సమర్పించారు.

భారీగా ఉద్యాన సహాయకుల బదిలీలు

నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఐదేళ్ల నుంచి పని చేస్తున్న గ్రామ ఉద్యాన సహాయకులకు శనివారం పట్టణంలోని మున్సిపల్‌ అతిథి గృహంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గుంటూరు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి.రవీంద్రబాబు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఉద్యానశాఖ అధికార్లు ఐ.వెంకటరావు, ఎస్‌ఎంఏ కరీం ఆధ్వర్యంలో 162మందిని బదిలీ చేశారు. కార్యక్రమంలో మూడు జిల్లాల ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.

సాగర్‌ నీటి మట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 514.20 అడుగుల వద్ద ఉంది. ఇది 138.9118 టీఎంసీలకు సమానం.

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ 1
1/2

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ 2
2/2

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement