పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

Jun 29 2025 2:46 AM | Updated on Jun 29 2025 2:46 AM

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు

ఏలూరు టౌన్‌: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి రక్షించారు. రైల్వే ఎస్‌ఐ సైమన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్‌పాల్‌ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో దిగింది. బయటకు వచ్చి తమ్మిలేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. సమీపం నుంచి గమనిస్తున్న కార్మికులు వెంటనే స్పందించి రక్షించి ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్‌పాల్‌, మహిళ అన్న ఇద్దరూ ఏలూరు చేరుకున్నారు. ఏలూరు రైల్వే పోలీసులు జీజీహెచ్‌కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్‌పాల్‌కు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement