
వైఎస్సార్ సీపీ శిలాఫలకం ధ్వంసం
పెదకాకాని: గుర్తు తెలియని వ్యక్తులు అగతవరప్పాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ శిలాఫలకం ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు ఏవీఎన్ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ను 2024 జనవరి నెలలో ప్రారంభించారు. సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అప్పటి ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు ఆవిష్కరించి ప్రారంభోత్సవం చేశారు. ఆ శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకం ధ్వంసంపై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లినట్లు సర్పంచి పిట్టు శివకృష్ణారెడ్డి తెలిపారు.