ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలన

Apr 30 2025 5:09 AM | Updated on Apr 30 2025 5:09 AM

ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలన

ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలన

తాడికొండ: ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. మే 2వ తేదీ సాయంత్రం 3:20 గంటలకు ప్రధాని మోదీ అమరావతికి వస్తారని మంత్రి చెప్పారు. రాజధాని పనుల పునఃప్రారంభంతో పాటు రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని ప్రారంభిస్తారని వెల్లడించారు.

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): రాజధాని ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్న సభకు జిల్లా నుంచి తరలివచ్చే ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాల్‌లో ప్రధాని పర్యటనపై అధికారులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

తాడికొండ: ప్రధాని మోదీ మే 2న అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి అనిత మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తు, ఇతర వివరాలు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌కుమార్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ వివరించారు.

గుంటూరు వెస్ట్‌: అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కానున్న భారత ప్రధాని నరేంద్రమోదీ సభను అధికారులు సమన్వయంతో, పటిష్ట ప్రణాళికతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జేసీ ఎ.భార్గవ్‌తేజతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీలు పాల్గొనే సభ విజయవంతానికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఆహారం, మంచినీరు లాంటి వసతులు సమకూర్చా లన్నారు. డీఆర్‌ఓ షేక్‌ ఖాజావలి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement