
ఆషాఢం ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంపై ఆషాఢం ఎఫెక్ట్ పడింది. దీంతో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. సాధారణంగా భక్తుల రాక ఎక్కువగా ఉండాల్సి ఉండగా సాధారణంగానే కనిపించింది. ఆలయంలో అన్ని విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు. క్షేత్రంలో వ్యాపారాలన్నీ మందకొడిగా సాగాయి.
కేంద్ర గ్రంథాలయానికి కొత్త భవనం
ఏలూరు(మెట్రో): ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి, గ్రంథాలయ సంస్థల డైరెక్టర్ నుంచి అనుమతిని తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ప్రమాద స్థితిలో ఉన్న కా రణంగా కొత్త భవనం నిర్మించాల్సి ఉందన్నా రు. అలాగే గ్రంథాలయంలో వసతులు కల్పించాలని, స్థానిక సంస్థలు, వివిధ సంస్థల నుంచి గ్రంథాయాల సెస్సు బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎమ్.శేఖర్బాబు, డీపీఓ కె.అనురాధ, వయోజన విద్య ఉపసంచాలకుడు ప్రభాకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు.సురేంద్రనాథ్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 275 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని శనివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 275 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్కు 100 మందికి 93 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 201 మందికి 182 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
జంగారెడ్డిగూడెం: లైంగిక దాడులు, వేధింపులు వంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ యు.రవిచంద్ర అన్నారు. పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారైన నేపథ్యంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో పట్టణంలోని మందుల షాపు నిర్వాహకుడు షేక్ ఇబ్రహీం ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఇబ్రహీంపై కేసు నమోదు చేయగా ఏలూరు స్పెషల్ స్పీడ్ ట్రైల్, పోక్సో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారన్నారు. ఇబ్రహీంకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించారని, అలాగే బాధితురాలికి రూ.50 వేలు పరిహారం అందించాలని న్యాయ స్థానం ఆదేశించిందన్నారు.
తల్లితండ్రులు పర్యవేక్షించాలి
బాలికలు, యువతులను తల్లితండ్రులు ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి జాగ్రత్తలు నే ర్పాలని డీఎస్పీ సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే 112 లేదా శక్తి బృందానికి సమాచారం ఇవ్వాలన్నారు.
గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష
తణుకు అర్బన్: బెల్టు షాపులను అరికట్టి అక్రమ మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన తాటికల్లుపై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం, ఊరువాడా బెల్టు షాపుల్లో అమ్మకాలు చేస్తూ కల్లు అమ్మకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మా ట్లాడుతూ మద్యం విచ్చలవిడి అమ్మకాలతో ప లు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జూలై 14న కల్లుగీత కార్మికుల వెతలు కలెక్టర్కు చెప్పుకుందాం కార్యక్రమానికి భీమవరం తరలిరావాలని కోరారు.

ఆషాఢం ఎఫెక్ట్

ఆషాఢం ఎఫెక్ట్