దుగ్గిరాలలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

దుగ్గిరాలలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

Jun 25 2025 1:25 AM | Updated on Jun 25 2025 1:25 AM

దుగ్గ

దుగ్గిరాలలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్యలు, వికృత చేష్టలతో హద్దులు దాటి విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో దుగ్గిరాల ప్రధాన కూడలిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటును స్థానిక కూటమి నాయకులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చిన తరువాత మహానేత వైఎస్సార్‌ విగ్రహం చెయ్యి విరగ్గొట్టి, తల వెనుక భాగంలో కర్ర పుల్ల గుచ్చి అవమానించడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. దీనిపై జిల్లా పోలీస్‌ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, వారు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.

విగ్రహ ధ్వంసం సరైంది కాదు

దుగ్గిరాలలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఖండించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా విగ్రహాలు ధ్వంసం చేసే విధానం సరైంది కాదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ప్రజలు దైవంగా భావిస్తారని, అటుంవంటి మహనీయుని విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

అధికారులు స్పందించకపోతే ఉద్యమిస్తామని వెల్లడి

దుగ్గిరాలలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం 1
1/1

దుగ్గిరాలలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement