
నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు
పాలకొల్లు సెంట్రల్: ఎకై ్సజ్ పోలీసులు పట్టణంలో నకిలీ మద్యం తయారీ ముఠా గట్టును రట్టు చేశారు. శంభునిపేటలో నివాసం ఉంటున్న పులి శీతల్ అనే వ్యక్తి ఇంటిలో నకిలీ మద్యం తయారవుతుందని వచ్చిన సమాచారంపై ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శీతల్ ఇంటిలో 130 లీటర్ల స్పిరిట్తోపాటు ప్రమాదకర ఎసెన్స్, నకిలీ మద్యం తయారీ యూనిట్, మద్యం సీసాలకు మూతలు బిగించే మిషన్, ఖాళీ మద్యం సీసాలు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ నడుపుతున్న పులి శీతల్ని అరెస్ట్ చేశారు. పాలకొల్లు ఎకై ్సజ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ నిందితుడికి స్పిరిట్, ఎసెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. శీతల్పై గుట్కా కేసు కూడా ఉందన్నారు. అమలాపురంలో ఈ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు అజయ్ సింగ్, ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పాలకొల్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్, భీమవరం స్క్వాడ్ సీఐ కల్యాణ చక్రవర్తి ఎస్సైలు రఘు, మహేష్, రమాదేవి ఈ దాడుల్లో పాల్గొన్నారు.