భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం

Jun 1 2025 12:59 AM | Updated on Jun 1 2025 12:59 AM

భక్తు

భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. కొండపైన టోల్‌గేట్‌, ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. దాదాపు 10,500 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం 1
1/1

భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement