
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. కొండపైన టోల్గేట్, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దాదాపు 10,500 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం