
సర్కారు వైద్యం నిర్వీర్యం
●
పేదలకు వైద్యం దూరం
కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్స్కు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో 3,225 రోగాలకు వైద్య చికిత్సలు అందిస్తూ పేదల ఆరోగ్యానికి భరోసా క ల్పించారు. ఇక ఇప్పుడు 108 అంబులెన్స్ సేవలు సైతం నామమాత్రంగా అందుతున్నాయి. ఫోన్ చేసినా అత్యవసర సేవలు అందే పరిస్థితి లేదు.
– దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రజలకు భంగపాటు
కూటమి ప్రభుత్వంలో మరి న్ని సేవలు అందుతాయని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. ఆరోగ్య ఆసరా రద్దు చేశారు, ఫ్యామి లీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు లేవు. పేదలు ప్రభుత్వాస్పత్రికి వెళితే పట్టించుకునే నాథుడే లేడు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. తమకు చెందిన కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
– కారుమూరి సునీల్కుమార్, వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకే తలమానికంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ఏలూరులో రూ.525 కోట్లతో ఏర్పాటుచేశారు. యుద్ధప్రాతిపదికన పాతబస్టాండ్ డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం రెండో ఏడాది 300 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఏలూరు సర్వజన ఆస్పత్రిని రూ.40 కోట్లతో ఆధునికీకరించారు. జీజీహెచ్ ప్రాంగణంలోనే ఆధునిక సౌకర్యాలతో శాశ్వత మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఆరోగ్యశ్రీతో పేదలకు భరోసా
2014–2019 కాలంలో టీడీపీ హయాంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయగా 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి పునరుజ్జీవం తెచ్చారు. ఏకంగా 3,225 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సలు అందించారు. 2020లో కరోనా కష్టకాలంలో కూడా కోవిడ్ సేవలను సైతం ఆరోగ్యశ్రీల చేర్చి పేదలను ఆదుకున్నారు.
అందరికీ ఆరోగ్య సురక్ష
● జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 498 వైద్య శిబిరాలు నిర్వహించారు. కంటి కాటరాక్ట్ పరీక్షలు 39 వేలకు పైగా నిర్వహించి 2,713 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు.
● రెండో విడతలో 551 వైద్య శిబిరాలు నిర్వహించి 61,140 మందికి ఓపీ సేవలు అందించారు.
విలేజ్ క్లినిక్లతో..
గత ప్రభుత్వంలో జిల్లాలో 64 పీహెచ్సీలు ఉండగా అదనంగా 78 విలేజ్ క్లినిక్స్ను ఏర్పాటుచేశారు. 105 రకాల మందులు, 14 రకాల వైద్యపరీక్షలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్తోపాటు కమ్యూనిటీ హెల్త్ కోర్సు పూర్తి చేసిన వైద్య నిపుణులలు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ, ఆశావర్కర్లు ఇక్కడ సేవలందించేవారు. అయితే కూటమి సర్కారులో విలేజ్ క్లినిక్స్ నిర్లక్ష్యానికి గురయ్యాయి. చాలా చోట్ల తాళాలు వేసి కనిపిస్తున్నాయి.
తల్లీబిడ్డలకు అండగా..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ వాహనాలతో ఆడబిడ్డలకు సేవలు అందించారు. ప్రసూతి అనంతరం తల్లీబిడ్డను ఈ వాహనాల ద్వారా సురక్షితంగా ఇంటికి చేర్చేవారు. ఇలా 2022 ఏప్రిల్ నుంచి 2023 జూలై వరకూ జిల్లాలో 4,976 మందిని, 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు 5,214 మంది బాలింతలను ఇళ్లకు చేర్చారు.
108కు జవసత్వాలు
మాజీ సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత 108 అత్యవసర సేవలకు జవసత్వాలు వచ్చాయి. 2020 జూలై 1న 19 కొత్త అంబులెన్సులను జిల్లాకు కేటాయించారు. అనంతరం మరో 4 అంబులెన్సులు మంజూరు చేశారు. మొత్తంగా 27 మండలాలకు ఒక్కో అంబులెన్స్, జిల్లాకు ఒక నియోనెటల్ అంబులెన్స్ సేవలందించాయి. ప్రస్తుత కూ టమి ప్రభుత్వంలో 108 వాహనాలు అందు బాటులో ఉండటం లేదు. ఫోన్ చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఫ్యామిలీ డాక్టర్తో ఇంటికే వైద్యం
గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకు గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఇద్దరు వైద్యులను నియమించటంతోపాటు వారు సిబ్బందితో కలిసి 104 సంచార వైద్యశాలలో గ్రామానికి వెళ్లి ప్రజలకు సేవలందించారు. ఇలా 2022 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు జిల్లాలో 5,56,039 మందికి, 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ 7,13,499 మంది వైద్య సేవలు అందించారు.
కరోనాలో అండగా..
కరోనా మహమ్మారి విజృంభించిన వేళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. జిల్లాలో మొదటి డోసుగా 34,79,105, రెండో డోసుగా 33,82,114 వ్యాక్సిన్లు అందించారు. జిల్లాలో 8 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు.
నేడు
కూటమి సర్కారు అధికారం చేపట్టిన ఏడాది కాలంలో వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేశారు. ఆరోగ్య ఆసరాను రద్దు చేశారు. గ్రామాల్లో పేదలకు ఇంటికే వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్, 104 సేవలు దూరమయ్యాయి. దీంతో పేదలు జబ్బు చేస్తే అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి. విలేజ్ క్లినిక్స్కు తాళాలు వేయగా, అర్బన్ హెల్త్ క్లినిక్స్లో నామమాత్రపు సేవలు అందుతున్నాయి. ఏలూరు జీజీహెచ్లో సైతం పూర్తిస్థాయిలో సేవలందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
నాడు
రూపాయి ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ సేవలు అందించేలా మాజీ సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం, 108, 104కు జవసత్వాలు కల్పించారు. దేశానికే ఆదర్శంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దకే వైద్యులను పంపి వైద్యసేవలు అందించారు. తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ సేవలు, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, యూపీహెచ్సీలను ఏర్పాటుచేసి ఆధునిక వైద్యసేవలకు చర్యలు తీసుకున్నారు. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
ప్రజారోగ్యానికి సుస్తీ
ఆరోగ్య ఆసరా రద్దు
ఫ్యామిలీ డాక్టర్, 108, 104లపై నీలినీడలు
కూటమి పాలనలో వైద్యరంగంపై నిర్లక్ష్యం
గత వైఎస్సార్సీపీ పాలనలో వైద్యానికి పెద్దపీట
ఆరోగ్యశ్రీలో లక్షలాది మందికి సేవలు
విలేజ్ క్లినిక్స్తో పల్లెల్లోనే వైద్యం
ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ఇలా..
సంవత్సరం వైద్య సేవలు వ్యయం ఆరోగ్య ఆసరా
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
2020–21 73,314 96.00 5.84
2021–22 72,305 98.00 15.00
2022–23 96,000 84.00 15.80
2023–24 98,000 92.00 6.97

సర్కారు వైద్యం నిర్వీర్యం

సర్కారు వైద్యం నిర్వీర్యం

సర్కారు వైద్యం నిర్వీర్యం

సర్కారు వైద్యం నిర్వీర్యం