పొగ.. ఆరోగ్యానికి సెగ | - | Sakshi
Sakshi News home page

పొగ.. ఆరోగ్యానికి సెగ

May 31 2025 1:31 AM | Updated on May 31 2025 1:31 AM

పొగ..

పొగ.. ఆరోగ్యానికి సెగ

కై కలూరు: పొగాకు వినియోగదారులు వ్యసన చక్రంలో బందీ అవుతున్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. దీని వల్ల గొంతు కేన్సర్‌, ఉపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు దాపరిస్తున్నాయి. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఏటా మే 31వ తేదీన ధూమపాన రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది శ్రీపొగాకు ఉత్పత్తుల ఆకర్షణలు తగ్గించడంశ్రీ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్నారు. ఏలూరు జిల్లాలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో పొగాకు వినియోగ అనర్థాలపై శనివారం అవగాహన కలిగించనున్నారు.

ఆకర్షితులవుతున్న యువత

యుక్తవయస్సులో సిగరెట్‌కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్‌ ఆనే పదార్థం ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయట పడలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచి కొంతమంది ఫ్యాషన్‌గా సిగిరెట్‌కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి.

కేన్సర్ల ముప్పు..

సిగిరెట్‌, బీడి, చుట్టా, జరదా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఉపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు కలుగుతున్నాయి. అదే విధంగా పక్షవాతము, అంధత్వము, చిగురు వాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలో ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి ఏటా 8 మిలియన్లు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా.

జిల్లాలో 2,354 మంది పొగాకు వ్యాధిగ్రస్తులు

ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,354 మంది పొగాకును వివిధ రూపాల్లో ఉపయోగించిన వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వ్యసనపరులకు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రూం నంబరు 15లో టొబోకో ససైషన్‌ వైద్యశాల(టీసీసీ)లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం వ్యాధిగ్రస్తులలో 146 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 955 మంది కోలుకునే దశలో ఉన్నారు. వ్యసనపరులకు వైద్యులు నికోటీవ్‌ రీప్లేస్‌మెంట్‌ థెరఫీతో వ్యసనాన్ని తగ్గిస్తున్నారు. కార్భన్‌ మోనాకై ్సడ్‌ అనలైజర్‌ అనే పరికరం ద్వారా రక్తంలో లెవల్స్‌ను పరీక్షించి, అనంతరం సైకాలజిస్టుతో కౌన్సిలింగ్‌ థెరిఫీ అందిస్తున్నారు.

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

జిల్లాలో పొగాకు సంబంధ వ్యాధిగస్తులు 2,354 మంది

వ్యసనపరులకు టీసీసీ సెంటర్‌ ద్వారా వైద్య చికిత్స

పొగ.. ఆరోగ్యానికి సెగ 1
1/2

పొగ.. ఆరోగ్యానికి సెగ

పొగ.. ఆరోగ్యానికి సెగ 2
2/2

పొగ.. ఆరోగ్యానికి సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement