నాడు వెలుగులు.. నేడు విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

నాడు వెలుగులు.. నేడు విధ్వంసం

May 29 2025 7:20 AM | Updated on May 29 2025 7:20 AM

నాడు

నాడు వెలుగులు.. నేడు విధ్వంసం

కై కలూరు మండలం వేమవరప్పాడులో సుమారు 700 ఇళ్లు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామంలో ఐదేళ్లలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకగా రూ.4.37 కోట్లు, అమ్మ ఒడిలో 257 మందికి రూ.1.06 కోట్లు, పేదలందరికీ ఇళ్లు పథకంలో 161 మందికి రూ.2.89 కోట్లతో ఇళ్ళ నిర్మించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25.30 లక్షలు ఖర్చు చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ద్వారా రూ.67.34 లక్షల లబ్ధి చేకూరింది. వైఎస్సార్‌ ఆసరా, చేయూత ద్వారా రూ.1.17 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఒక్క గ్రామానికి రూ.8.77 కోట్ల సంక్షేమ పథకాలు అందగా.. గ్రామంలో రూ. 9.73 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. మొత్తం రూ.18.50 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక్క గ్రామంలో ఖర్చుపెట్టారు.

గత ప్రభుత్వంలో ఏలూరు చొదిమెళ్ళలో

ఒకే ప్రాంతంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే

గత ప్రభుత్వంలో ప్రజలకు రూ.10 వేల కోట్ల నగదు జమ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేసింది. జిల్లాలో 2,35,847 మంది రైతులకు రైతు భరోసా ద్వారా రూ.1839.24 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. 97,584 మంది రైతులకు రూ.22.29 కోట్ల సున్నా వడ్డీ పంట రుణాలు అందించారు. రైతుభరోసా, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాలు, ఇతర పథకాల ద్వారా ఒక్క ఏలూరు జిల్లాలోనే రూ.10 వేల కోట్లకుపైగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

పథకం లబ్ధిదారులు చేకూరిన లబ్ధి

(రూ.కోట్లలో)

రైతు భరోసా 2,35,847 1839.24

సున్నా వడ్డీ రుణాలు 9,7584 22.29

పెన్షన్లు 2,81,470 3,880.09

వైఎస్సార్‌ ఆసరా 3,55,315 1305.05

డ్వాక్రా రుణాలు 30,917 (సంఘాలు) 702

వైఎస్సార్‌ సున్నా వడ్డీ 43,765 (సంఘాలు) 221.99

సీ్త్ర నిధి రుణాలు 39,255 546.53

వైఎస్సార్‌ చేయూత 1,16,491 561.53

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్‌ జగన్‌ పాలనలో గ్రామ సచివాలయాలతో మొదలైన పల్లెల అభివృద్ధి ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ల వరకు విస్తరించింది. ప్రతి పథకం ఇంటికి అందించేలా వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రేషన్‌ వాహనాలను నిలిపేశారు. నాడు వెలిగిపోయిన పల్లెటూరు నేడు విధ్వంసానికి గుర్తుగా మారింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తెరమరుగుచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశారు. రూ.వందల కోట్లతో సచివాలయ, ఆర్బీకే, హెల్త్‌ క్లినిక్‌ భవనాలు నిర్మించారు. వీటిని నిరుపయోగం చేసే ప్రక్రియ కూటమి ప్రభుత్వ పాలనలో కొనసాగుతోంది.

అంతా విధ్వంసమే

ఏలూరు జిల్లాలో 350 ఆర్బీకేలను రూ.83 కోట్లతో నిర్మించారు. 443 గ్రామ సచివాలయాలు రూ.193.15 కోట్లతో, 271 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు రూ.56.37 కోట్లతో నిర్మించారు. కూటమి ప్రభుత్వం క్లస్టర్ల పేరుతో సచివాలయాలు కుదించడం, కోవిడ్‌, వరదల్లో కీలకంగా పనిచేసిన వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయడం, 397కు పైగా మొబైల్‌ రేషన్‌ వాహనాలను తొలగించడం ఇలా అంతా విధ్వంసమే. గత ప్రభుత్వం సచివాలయాల్లో సుమారు 4701 మందికి ఉద్యోగాలు కల్పించింది. 10,800 మంది వలంటీర్లతో ప్రజలకు సేవలందించింది.

నిలిచిన ఇళ్ల నిర్మాణం

జిల్లాలో 1,16,431 ఇళ్ల పట్టాలను మంజూరు చేసి 98,874 ఇళ్లను రూ.713.17 కోట్లతో నిర్మించారు. జిల్లా చరిత్రలోనే ఇది కీలక ఘట్టం. కై కలూరు, ఏలూరు, దెందులూరు, చింతలపూడి ఇలా అన్ని నియోజకవర్గాల్లో జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఊళ్లు వెలిశాయి. కొత్త ప్రభుత్వం 49 వేల ఇళ్ళను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రకటించినా.. అడుగు ముందుకు పడని పరిస్థితి. జిల్లాలో 2032 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా రెండు విడతల్లో రూ.270.75 కోట్లతో రూపురేఖలు మార్చారు. 206 అంగన్‌వాడీ కేంద్రాలను రూ.4.5 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు.

కూటమి పాలనలో గ్రామ వ్యవస్థలు నిర్వీర్యం

అలంకారప్రాయంగా సచివాలయాలు, ఆర్బీకేలు

సేవలందక ప్రజలు, రైతులకు ఇక్కట్లు

గత ప్రభుత్వంలో రూ.193.15 కోట్లతో సచివాలయాలు, రూ.83 కోట్లతో ఆర్బీకేల నిర్మాణం

క్లస్టర్‌ పేరుతో సచివాలయ వ్యవస్థ విధ్వంసానికి కూటమి ప్రభుత్వం కుట్ర

లక్ష ఇళ్ల నిర్మాణంతో చరిత్ర సృష్టించిన నాటి సర్కార్‌

నేడు కాగితాలకే పరిమితం

సూపర్‌ సిక్స్‌ మొదలు జిల్లా స్థాయి హామీల వరకూ అన్నీ తూచ్‌

నాడు వెలుగులు.. నేడు విధ్వంసం 1
1/1

నాడు వెలుగులు.. నేడు విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement