
అ‘పూర్వ’ ఆత్మీయ కలయిక
భీమవరం: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం .. చదువులమ్మ చెట్టు నీడలో .. అంటూ పూర్వ విద్యార్థులు ఒకే చోట కలిశారు. గడచిన ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుని సందడి చేశారు. లూథరన్ హైస్కూల్ 1975 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 50 ఏళ్ల తరువాత ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించుకున్నారు. ఒకరిని ఒకరు పలరించుకుంటూ చిన్ననాటి మన స్నేహబంధం.. చిరకాలపు మధుర స్మతులుగా పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు తటవర్తి భాస్కరరావు, నంబూరి మాధవ, సుజ్ఞానరాజు, బెల్తాజర్, గోపా సత్యనారాయణ కొందరు మిత్రులు కలిసి గత కొన్ని నెలలుగా అందరినీ కలుపుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. 20 మంది ఉపాధ్యాయులను సత్కరించినట్లు చెప్పారు.