జీలుగుమిల్లిలో పట్టపగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

జీలుగుమిల్లిలో పట్టపగలే చోరీ

May 25 2025 8:02 AM | Updated on May 25 2025 8:02 AM

జీలుగుమిల్లిలో పట్టపగలే చోరీ

జీలుగుమిల్లిలో పట్టపగలే చోరీ

బుట్టాయగూడెం: తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ జరిగిన ఘటన జీలుగుమిల్లిలో జరిగింది. బాధితుడు సాదు చిన్నారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్నారావు జీడిగింజలు, పత్తి వ్యాపారం చేస్తుంటాడు. శనివారం అతని భార్య ఇంటికి తాళం వేసి సెంటర్‌లో షాపునకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉన్నాయని, అందులో వెండి, బంగారం మాయమైనట్లు గుర్తించినట్లు బాధితులు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

జూదరుల అరెస్ట్‌

జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. రూ.7,380 నగదు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శశాంక తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement