
1.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
ఏలూరు(మెట్రో): రైతుల నుంచి ఇంతవరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో రబీ ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీ ధాన్యం దిగుబడి ఎక్కువ ఉన్నందున టార్గెట్ను 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. అనంతరం మరో 20 వేల మెట్రిక్ టన్నులు అదనంగా చేర్చామన్నారు. జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా 44,53,250 గోనె సంచులు రైతులకు సరఫరా చేసి జిల్లాలో 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు.