‘మన బడి – మన భవిష్యత్తు’పై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

‘మన బడి – మన భవిష్యత్తు’పై సమీక్ష

Aug 22 2024 3:36 AM | Updated on Aug 22 2024 3:36 AM

‘మన బడి – మన భవిష్యత్తు’పై సమీక్ష

‘మన బడి – మన భవిష్యత్తు’పై సమీక్ష

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ‘మన బడి – మన భవిష్యత్తు‘ పనుల పురోగతిలో సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ల పాత్ర అత్యంత కీలకమైనదని కలెక్టర్‌ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో సర్వశిక్షా అభియాన్‌ పథక సంచాలకులు, ఇతర ప్రభుత్వ శాఖల ఇంజినీరింగ్‌ అధికారులతో ‘మన బడి మన భవిష్యత్తు‘ పై సమీక్ష, సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్స్‌తో జిల్లాలోని 655 పాఠశాలల్లో జరుగుతున్న స్కూల్‌ భవనాలలో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, మనబడి మన భవిష్యత్తు అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇంజినీరింగ్‌ పనులను పూర్తి చేసే క్రమంలో ఐదు శాఖల ఆధ్వర్యంలో పనులను చేపడతామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రూ.96.33 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌కు చెందిన రూ.77.95 కోట్లకు చెల్లింపులు పూర్తి అయ్యాయన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండేలా ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వ

జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన

బుధవారం తన చాంబర్‌లో సాంఘిక ఎలుక నివారణ కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. 18 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎలుకల నివారణ కోసం మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,82,103 ఎకరాల్లో ఆగస్టు 25 నుంచి 31 వరకు సామూహిక ఎలుకల నివారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి

అధికారులను అదేశించిన

కలెక్టర్‌ ప్రశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement