21 Year Old Adilabad Girl Commits Suicide For Her Lover Not Accept Marriage - Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

Jul 6 2021 4:03 PM | Updated on Jul 6 2021 8:25 PM

Girl Commits Self Distruction In Adilabad - Sakshi

అశ్విని(ఫైల్‌)

సాక్షి, దహెగాం(ఆదిలాబాద్‌): మూడేళ్లుగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికిగురైన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రఘపతి తెలిపిన ప్రకారం, దహెగాంకు చెందిన సింగూరపు అశ్విని(23) అదే గ్రామానికి చెందిన బాస్కె తిరుపతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతిని దూరంగా ఉంచడంతో మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది.

గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా కాగజ్‌ నగర్‌కు అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తం‍డ్రి మధుకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement