
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
గత వారం చిత్తూరులో నగల దుకాణంలో చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
జిల్లాలోని మామిడి రైతులకు దిక్కులేకుండా పోయింది. అధికారులు, పాలకుల మాటలను ఫ్యాక్టరీ యజమానులు లెక్క చేయడం లేదు. దీంతో మామిడి కాయలు అమ్ముకోవడానికి పోరాటం చేయాల్సి వస్తోంది. చిత్తూరు, జీడీ నెల్లూరు, తవణంపల్లె, బంగారుపాళ్యం మండలాల్లో సోమవారం టోకెన్లు ఇవ్వలేమని ఫ్యాక్టరీలు బోర్డులు పెట్టేశాయి. దీంతో ఫ్యాక్టరీల ఎదుట రైతుల ఆందోళనకు దిగి రోడ్లపై బైఠాయించారు. రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొన్ని ఫ్యాక్టరీలు నామమాత్రంగా టోకెన్లు ఇచ్చాయి. అయినా రైతుల గోడును పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.
– కాణిపాకం
జిల్లాలో ప్రస్తుతం తోతాపురి రకం మామిడి కాయలు పక్వానికి రావడంతో కోతలు జోరందుకు న్నాయి. ఈ కాయలను ఫ్యాక్టరీ నిర్వాహకులు కొన డం లేదు. ఏదో కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం బయట రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి కాయలను కొనుగోలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ఫ్యాక్టరీలు వాటిని లెక్కచేయడంలేదు.
చిత్తూరులో ఏం జరిగిందంటే...
చిత్తూరు నగరం గంగాసాగరంలోని ఓ గుజ్జు పరిశ్రమ సోమవారం టోకెన్లు ఇస్తున్నట్లు వారం రోజుల ముందే బోర్డు పెట్టింది. టోకెన్లు ఇస్తారని మామిడి రైతులు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడే కునుకు తీస్తూ.. ఆధార్, పట్టా పాసు పుస్తకం జెరాక్స్ నకలను క్యూలో పెట్టారు. ఉదయం 7గంటలకు రైతు లు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నప్పటికీ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసికట్టుగా చిత్తూరు–వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడారు. టోకెన్లు ఇస్తామని చెప్పడంతో ఆ తర్వాత ఫ్యాక్టరీ గేటును రైతులు చుట్టుముట్టేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అక్కడ రైతుల అరుపులు, కేకలతో ఫ్యాక్టరీ ఆవరణ దద్ధరిల్లింది. అక్కడే ఉన్న వృద్ధురాలికి ఊపిరి ఆడలేదు. వెంటనే రైతులు ఆ వృద్ధురాలిని ఫ్యాక్టరీ లోపలికి పంపారు. ఆపై అరకొరగా టోకెన్లు ఇచ్చిన ఫ్యాక్టరీ నిర్వాహకులు వచ్చేనెల 5వ తేదీ టోకెన్లు ఇస్తామంటూ మరో బోర్డు పెట్టారు. దీంతో టోకెన్లు అందని రైతులు మళ్లీ నిరసనకు దిగారు.
పలుచోట్ల ఇదే పరిస్థితి
గంగాధర నెల్లూరు మండలంలో మూడు రోజులుగా మామిడి కాయలను ట్రాక్టర్ల నుంచి అన్లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. ఇప్పటివకే ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు భారీ సంఖ్యలో క్యూకట్టాయి. బంగారుపాళ్యం మండలంలో కూడా ఫ్యాక్టరీలు టోకెన్లు ఇవ్వకుండా తలుపులు వేసేశాయి. వచ్చే నెల టోకెన్లు ఇస్తామని ముఖం చాటేశాయి. ఒక చేసేది లేక రైతులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి, చివరికి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. తవణంపల్లె మండలంలోని ఫ్యాక్టరీలు కూడా మామిడి రైతులకు టోకెన్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి.
చిత్తూరు: గంగాసాగరం ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగిన రైతులు
– 8లో
– 8లో
పంట అమ్ముకోవడానికి తంటాలు
పడిగాపులు కాసి కాసి సహనం కోల్పోయిన వైనం
రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన ట్రాఫిక్
జీడీనెల్లూరు, బంగారుపాళెం, తవణంపల్లెలోనూ అదే తంతు!
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
రైతుల గోడు పట్టని ప్రభుత్వం
రైతులు తాము పండించిన మామిడి కాయలు అమ్ముకోవడానికి చావో రేవో అని పోరాడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ వారి వైపు కన్నెత్తి చూడడం లేదు.
కూటమి నేతల సిఫార్సులకే టోకెన్లు
కూటమి నేతల సిఫార్సులకు మామిడి టోకెన్లు అమ్ముడుబోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, కలెక్టరేట్, ఇతరత్రా అధికారుల పేర్లు చెబుతూ టోకెన్లను దండుకుంటున్నారని ఫ్యాక్టరీ నిర్వాహకులు బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య రైతులు నిండా మునిగిపోతున్నారు. జిల్లాల్లో కొద్ది రోజులుగా హల్చల్ చేసిన రైతు సంఘం నాయకులు ఫ్యాక్టరీల ఎదుట కనిపించడం లేదు. వారి పంటను మాత్రం అమ్ముకుని వెళ్లిపోయారని రైతులు మండిపడుతున్నారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు