లాభాల్లో ముగిసిన మార్కెట్.. కొత్త గరిష్ఠానికి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన మార్కెట్.. కొత్త గరిష్ఠానికి నిఫ్టీ

Published Tue, Oct 12 2021 4:07 PM

Stock Market Bell: Sensex, Nifty end Higher Amid Volatility - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఆ తర్వాత టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు రాణించడంతో సూచీలు పుంజుకున్నాయి. ఆర్థిక, ఎఫ్​ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి. చివరకు, సెన్సెక్స్ 148.53 పాయింట్లు (0.25%) లాభపడి 60,284.31 వద్ద ముగిస్తే, నిఫ్టీ 46.00 పాయింట్లు (0.26%) పెరిగి 17,992.00 వద్ద ముగిసింది. సుమారు 1664 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1483 షేర్లు క్షీణించాయి, మరియు 115 షేర్లు మారలేదు.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.75.38 వద్ద ఉంది. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్ బిఐ మరియు హిందాల్కో షేర్లు భారీగా లాభపడితే.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా మరియు శ్రీ సిమెంట్ షేర్లు భారీగా క్షీణించాయి. నేడు ఆటో, ఎఫ్ఎంసిజి, మెటల్, పిఎస్‌యు బ్యాంక్ సూచీలు 1-3 శాతం పెరగగా.. ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం నష్టపోయింది.

(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!)

Advertisement
Advertisement