ఏపీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం | Reliance Foundation Rs 20 Crore Aid For Andhra Pradesh Flood Victims, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం

Sep 28 2024 7:52 AM | Updated on Sep 28 2024 9:27 AM

Reliance Foundation Rs 20 crore aid for Andhra Pradesh flood victims

ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ విరాళం అందించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావులు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు.

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు పలు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చి భారీ సాయం అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement