ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! | RBI Proposes Introduction Of E-Checks To Digitally Modernize Payment System, More Details Inside | Sakshi
Sakshi News home page

ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

Mar 29 2026 6:00 PM | Updated on Mar 29 2026 6:23 PM

RBI Weighs E Cheques To Modernise Payment System

చెల్లింపు వ్యవస్థను మరింత కొత్తగా మార్చే ప్రక్రియలో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్తగా ఈ-చెక్స్ (ఎలక్ట్రానిక్ చెక్స్) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ చర్యకు కారణం భద్రతను పెంచడం.. వ్యాపార, వినియోగదారుల అవసరాలను తీర్చడం.

ఆర్‌బీఐ తన పేమెంట్స్ విజన్ 2028 నివేదికలో.. చెక్స్ డిజైన్, భద్రతా లక్షణాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సౌకర్యం, ఒక్కసారిగా అమలులో ఉండే విధానం, మోసాల నివారణ, కొత్త చెల్లింపు విధానాలతో సర్దుబాటు సాధ్యమవుతుందని వెల్లడించింది.

ఈ-చెక్ అంటే?
ఈ-చెక్ అనేది కాగితపు చెక్కుకు డిజిటల్ రూపం. అంటే దీనిని కాగితంపై కాకుండా ఆన్‌లైన్‌లో పంపుతారు. చెల్లింపుదారుడు వివరాలను నింపి, డిజిటల్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సంతకం చేసి, దానిని చెల్లింపు గ్రహీతకు లేదా బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ దీన్ని సాధారణ చెక్‌లా పరిశీలించి ప్రాసెస్ చేస్తుంది. ఇది వేగంగా, సురక్షితంగా, పేపర్ లెస్‌గా, ట్రాక్ చేయడానికి సులభంగా ఉంటుంది.

ఇదీ చదవండి: భారత్‌లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement