వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!
గ్లోబల్ కంపెనీలకు ఇండియన్లు సీఈవోలుగా అవడాన్ని సీఈవో వైరస్ ఫ్రం ఇండియా అంటూ చమత్కరించిన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సమకాలిన సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం స్పందిస్తుంటారు. దేశంలో ఏ మూలన అయినా సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినట్టు ఆయన దృష్టికి వస్తే చాలు.. ప్రశంసలు కురిపించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయరు. తాజాగా నేషనల్ కేడెట్ కార్ప్ (ఎన్సీసీ) వాలంటీర్లు చేసిన పనిని ఆయన మెచ్చుకున్నారు.
ముంబై నగరంలోని ఓ బీచ్లో పునీత్ సాగర్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లు ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. బీచ్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ సెంటర్లకు పంపించారు. ఈ ఫోటోలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఎన్సీసీ బాధ్యత కలిగిన పౌరులను తయారు చేస్తుందంటూ కొనియాడారు.
Even as I participate in a committee to revamp the NCC I’m delighted to see & applaud this initiative. Under the PuneetSagar Abhiyan, the NCC has undertaken the cleaning of beaches & collection of plastic waste for recycling. The NCC produces good Citizens! pic.twitter.com/mvIOibX3cv
— anand mahindra (@anandmahindra) December 17, 2021