మట్టి ఇటుకలకు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో ఆదివారం నిర్వహించిన సండే బ్రిక్స్ చాలెంజ్ పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా...ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలు వృద్ధుల వరకు పోటీల్లో భాగస్వాములయ్యారు. పర్యావరణహిత మట్టి ఇటుకలపై ప్రజలలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమకు ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన సీఎస్ఈవీ నిపుణుడు సుధాకర్రెడ్డి మట్టి ఇటుకల తయారీ విధానంపై అవగాహన కల్పించారు. 60 శాతం మట్టి, 20 శాతం ఇసుక, 10 శాతం సిమెంట్, పది శాతం సున్నం కలిపిన మిశ్రమంతో యంత్రం ద్వారా ఇటుకలను తయారు చేశారు.
దృఢ సంకల్పంతో...
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
బ్రిక్స్ చాలెంజ్ కార్యక్రమం పోటీ మాత్రమే కాదని సంప్రదాయ, దృఢ సంకల్పమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో ఎర్రమట్టి పుష్కలంగా లభిస్తుందని, సిమెంట్, ఇసుక, సున్నం కలిపి ఇటుకలు తయారు చేస్తే దృఢంగా ఉంటాయని, కాల్చిన ఇటుకలకు ధీటుగా ఉంటాయని వివరించారు. బెంగళూరు వంటి నగరాల్లో ధనవంతులు ఉదయం వ్యాయామంగా మట్టి ఇటుకలను తయారుచేసి సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారని తెలిపారు. మట్టి ఇటుకలతో జిల్లావ్యాప్తంగా పాఠశాలల ప్రహరీలు, మరుగుదొడ్లు, వంటషెడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కలెక్టర్ క్యాప్లు, టీ షర్ట్లు బహూకరించారు. విద్యాశాఖ కోఆర్డినేటర్ సైదులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, డీఈఓ వెంకటేశ్వరాచారి, విద్యాశాఖ కో ఆర్డినేటర్ నాగ రాజశేఖర్, డీఆర్డీఏ, మెప్మా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వాకర్లు, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.
సండే సందడిగా బ్రిక్స్ చాలెంజ్ పోటీలు
తక్కువ వ్యయంతో మట్టి ఇటుకల తయారీపై అవగాహన
ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువకుల భాగస్వామ్యం
యువతకు ఉపాధి
మా కరాటే విద్యార్థులు చాలా మంది పాల్గొన్నారు. వారి ఇళ్లలో తయారీకి ప్రయత్నిస్తారు. దృఢమైన నిర్మాణాలకు మట్టి ఇటుకలను ఉపయోగించుకునేలా ప్రజలకు మా తరఫున అవగాహన కల్పిస్తాం.
– పంతంగి సాయి నిరంజన్, కరాటే కోచ్
అవగాహన కలిగింది
సండే బ్రిక్స్ చాలెంజ్లో పాల్గొనడం ద్వారా మట్టి ఇటుకల తయారు చేసే పద్ధతి తెలిసింది. తోటి విద్యార్థులతో ఈ అనుభవాన్ని, ప్రాధాన్యతను పంచుకుంటాను. చాలా మంచి కార్యక్రమం.
– ఓ.ఇందు, ఇంటర్ విద్యార్థిని,
సింగరేణి మహిళా కళాశాల
దృఢమైన నిర్మాణాలు..
మట్టి ఇటుకలతో నిర్మాణాలు దృఢంగా ఉండటంతోపాటు పర్యావరణానికి మేలు చేస్తాయి. ప్లాస్టింగ్ అవసరం ఉండదు. వీటితో నిర్మించే ఇంట్లో వేసవిలో చల్లదనం ఉంటుంది. సాధారణ ఇటుకలతో పోలిస్తే తయారీ తేలిక, ఖర్చు తక్కువ. దీని ద్వారా ఉపాఽధీ పొందవచ్చు.
–సుధాకర్రెడ్డి, బెంగళూరు సీఎస్ఈవీ నిపుణుడు
ప్రాధాన్యత తెలిసింది
పర్యావరణహిత మట్టి ఇటుకల ప్రాధాన్యం తెలిసింది. మట్టి ఇటుకల తయారీపై మా పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాను. నిర్మాణాల్లో వినియోగించే విధంగా కృషి చేస్తాను. –నాగలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయురాలు, టేకులపల్లి
గట్టి ప్రయత్నం..
గట్టి ప్రయత్నం..
గట్టి ప్రయత్నం..
గట్టి ప్రయత్నం..
గట్టి ప్రయత్నం..
గట్టి ప్రయత్నం..