
బాలకార్మికులను గుర్తించాలి
చండ్రుగొండ : బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన అధికారులకు సూచించారు. మండలంలోని అయన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తొలుత పిల్లలతో విద్యాభ్యాసం చేయించారు. పలకలు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం పీఎంశ్రీ నిధులతో నిర్మించిన తరగతి గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, ఇతర సైదులు, నాగరాజశేఖర్, బయ్యారపు అశోక్, సత్యనారాయణ పాల్గొన్నారు.