స్వర్ణకవచ ధారణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

స్వర్ణకవచ ధారణలో రామయ్య

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

స్వర్

స్వర్ణకవచ ధారణలో రామయ్య

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్‌.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

స్కిల్‌ ట్రైనింగ్‌కు

28 మంది ఎంపిక

సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం బాబూక్యాంపులోని మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 52 మంది పేర్లు నమోదు చేసుకోగా, 28 మంది ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్‌ వివరాలు వెల్లడించారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తూ వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందని, ఆ తర్వాత అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ స్టెవార్డ్‌, రిటైల్‌ సేల్స్‌ అసోషియేట్‌లలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.

మున్సిపల్‌

వార్డుల విభజనపై ఆరా

అశ్వారావుపేటరూరల్‌: కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియను శుక్రవారం వార్డుల విభజన ప్రత్యేకాధికారి, మధిర మున్సిపాలిటీ కమిషనర్‌ ఏ.సంపత్‌ పరిశీలించారు. పలు ప్రాంతాలను సందర్శించి విభజనపై ఆరా తీశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టణ ప్రణాళిక అధికారి వలసాల శ్రీనివాసరావుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మున్సిపల్‌ సిబ్బంది ఎం.కామేష్‌, నాగేంద్ర, రమణ, మురళి, కట్టా శ్రీను పాల్గొన్నారు.

స్వర్ణకవచ ధారణలో రామయ్య1
1/3

స్వర్ణకవచ ధారణలో రామయ్య

స్వర్ణకవచ ధారణలో రామయ్య2
2/3

స్వర్ణకవచ ధారణలో రామయ్య

స్వర్ణకవచ ధారణలో రామయ్య3
3/3

స్వర్ణకవచ ధారణలో రామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement