పట్టాలు తప్పిన జీఆర్‌పీ | - | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన జీఆర్‌పీ

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 పట్టాలు తప్పిన జీఆర్‌పీ బాపట్ల టౌన్‌ : ఇటీవల కాలంలో రైలులో గంజాయి సరఫరా, చైన్‌స్నాచింగ్‌లు అధికసంఖ్యలో జరుగుతున్నాయి. ఓ వైపు దొంగతనాలు.. మరోవైపు మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నా రైల్వే పోలీసులు నిర్లక్ష్యం వీడటం లేదు. ముందస్తుగా సమాచారం వచ్చిన కేసులు మినహా విస్తృత తనిఖీలు చేపట్టి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టిన దాఖలాలు లేవు. రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ ప్రాంతంలో రైలు వేగం నెమ్మదిగా ఉంటుంది. పైగా ఆ ప్రాంతం నిర్మానుష్య ప్రాంతం కావడం, పైగా అదే ప్రాంతంలో బాపట్ల –చీరాల –గుంటూరు ప్రధాన రహదారి సౌకర్యం ఉంది. అలాంటి చోట అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడంతో దొంగలకు కలిసొచ్చింది. దీనికి ఆదివారం అర్ధరాత్రి బెంగళూరు–నరసాపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ రైలులో జరిగిన దొంగతనమే నిదర్శనం. ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు – నరసాపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలులో 1.45 నుంచి 1.55 గంటల మధ్యలో రైలులోని ఎస్‌–4, ఎస్‌–7, ఎస్‌–11, ఎస్‌–12, ఎస్‌–13 బోగీల్లో నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారం, వెండి గొలుసులను దొంగలు లాక్కెళ్లారు. మహిళలు నిద్రలోనుంచి తేరుకునేలోపు ఏసీ కోచ్‌ ఏ–1లో చైన్‌ లాగి రైలు ఆపి దిగి పరారయ్యారు. రైల్వే అధికారులు, బాధితులు అంతా లేచిచూసేసరికి దొంగిలించిన రూ. లక్షల సొమ్ముతో దొంగలు పారిపోయారు. ఇలాంటి ప్రాంతాలను ముందుగా గుర్తించి రైలు నిదానంగా ప్రయాణించే ప్రదేశం వరకు ఎస్కార్ట్‌ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకొంటే చోరీ జరిగేది కాదని ప్రయాణికులు, బాధితులు వాపోతున్నారు.

న్యూస్‌రీల్‌

కాలం చెల్లిన ఫోన్‌ నంబర్లతో కాలయాపన

రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే సమాచారం అందించేందుకు వీలుగా జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ ముందు బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులపై నంబర్లకు కాలం చెల్లినా ఇప్పటికీ అవే స్టేషన్‌ ముందు దర్శనం ఇస్తున్నాయి. బోర్డులపై ఉన్న ఫోన్‌ నంబర్లు పనిచేయకపోతున్నప్పటికీ వాటి స్థానంలో కొత్త నంబర్లను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో జీఆర్‌పీ పోలీసులు ఉన్నారు. బాపట్ల రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ ముందు ఎస్‌హెచ్‌వో నంబర్‌ 89857 39848 అని రాసి ఉంది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ‘‘మీరు డయల్‌ చేసిన నెంబర్‌ తాత్కాలికంగా సేవల్లో లేదు... దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి’’ అనే సమాధానం వస్తోంది. డీఎస్‌ఆర్‌పీ నంబర్‌ 78826 19037కు ఫోన్‌ చేస్తే ‘‘మీరు డయల్‌ చేసిన నెంబర్‌ పనిచేయటం లేదు. దయచేసి నెంబర్‌ చెక్‌ చేసుకొని మళ్లీ ప్రయత్నించండి’’ అనే సమాధానం వస్తోంది. ఈ సమాధానాలు విన్న ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి. దీంతో జీఆర్‌పీ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అధికారుల తీరు మారేలా చూడాలని, మనుగడలో ఉన్న ఫోన్‌ నంబర్లు బోర్డులపై ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

నిమ్మకాయల ధరలు

వైభవంగా చండీహోమం

బాపట్ల
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కార్యాలయంలో ఎప్పుడు

చూసినా ఖాళీ కుర్చీలే దర్శనం

మనుగడలో లేని ఫోన్‌ నంబర్లతో

దర్శనం ఇస్తున్న బోర్డులు

ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి

విసుగు చెందుతున్న బాధితులు

రెప్పపాటులో రూ. 18 లక్షలు చోరీ

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.14,500, మోడల్‌ ధర రూ.11,000 వరకు పలికింది.

ఫిరంగిపురం: నుదురుపాడు కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శంకర జయంతిని పురస్కరించుకొని చండీహోమం నిర్వహించి పూర్ణాహుతి గావించారు.

Advertisement
 
Advertisement
Advertisement