కొనసాగుతున్న నాటికల పోటీలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నాటికల పోటీలు

Jul 7 2025 6:24 AM | Updated on Jul 7 2025 6:24 AM

కొనసా

కొనసాగుతున్న నాటికల పోటీలు

తెనాలి: రోటరీ కళాపరిషత్‌, ఈదర రామారావు చారిటబుల్‌ ట్రస్ట్‌ – తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు రెండవ రోజైన ఆదివారం కొనసాగాయి. ప్రదర్శనలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ జ్యోతిప్రజ్వలన చేశారు. సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్‌ సాయిమాధవ్‌ బుర్రా, పోస్టల్‌ ఎంప్లాయీస్‌ కళాపరిషత్‌ అధ్యక్షుడు డీఎల్‌ కాంతారావు, ఈదర వెంకట పూర్ణచంద్‌, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి వెంకట నారాయణ పాల్గొన్నారు. తొలిగా చైతన్య కళాస్రవతి–ఉక్కునగరం, విశాఖ వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. సుధ మోదుగు మూలకథకు పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించగా పి.బాలాజీనాయక్‌ దర్శకత్వంలో ప్రదర్శించారు. తదుపరి న్యూస్టార్‌ మోడ్రన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, విజయవాడ వారి ‘ఐ యేట్‌ ఇండియా’ నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఎం.ఎస్‌.చౌదరి. చివరిగా యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌, విజయవాడ వారి ‘అనుకున్నదొకటి అయినదొక్కటి’ హాస్యనాటికను ప్రదర్శించారు. గోపి వల్లభ రచనకు ఆర్‌.వాసుదేవరావు దర్శకత్వం వహించారు.

కొనసాగుతున్న నాటికల పోటీలు 1
1/1

కొనసాగుతున్న నాటికల పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement