రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం

Jun 2 2025 2:00 AM | Updated on Jun 2 2025 2:00 AM

రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం

నరసరావుపేట ఈస్ట్‌: ఈత అత్యుత్తమ వ్యాయామమని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ ఆక్వాటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌లో 11వ సీనియర్‌ అంతర్‌ జిల్లాల స్విమింగ్‌ ఛాంపియన్‌షిప్‌– 2025 పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్‌ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ ఆక్వాటిక్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.రవికాంత్‌, అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, కార్యదర్శి మోహనవెంకటరామ్‌, కోశాధికారి రమేష్‌, పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement