కూటమి పాలనలో అభివృద్ధి సున్నా | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో అభివృద్ధి సున్నా

Jun 3 2025 5:27 AM | Updated on Jun 3 2025 5:27 AM

కూటమి పాలనలో అభివృద్ధి సున్నా

కూటమి పాలనలో అభివృద్ధి సున్నా

మాజీ డెప్యూటీ స్పీకర్‌, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి

ప్రజా వ్యతిరేక విధానాలపై రేపు నిరసన

బాపట్ల: కూటమి ప్రభుత్వంలో ఆర్భాటాలే తప్పా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి విమర్శించారు. సోమవారం స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 4న ప్రభుత్వ వెన్నుపోటు కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సీపీ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి ప్రదర్శన చేపట్టి తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా తాను చేసిన అభివృద్ధి తప్పా ఎక్కడా వీసమెత్తు అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. అనేక అబద్ధపు ప్రచారాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. పెన్షన్‌ మాత్రమే అందిస్తూ సంక్షేమ పథకాల అమలు చేయడంలో పూర్తిస్థాయిలో వెనకబడి ఉందని తెలిపారు. సూర్యలంక బీచ్‌ అభివృద్ధి కోసం రూ. 97 కోట్లు మంజూరు చేశామని ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని, అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల డీపీఆర్‌ తయారు చేసి బహిరంగపరచాలని కోన డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రజలకు అత్యంత ఉపయోగపడే మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను ఆపేశారని, తక్షణమే ప్రారంభించి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 4న నిర్వహించనున్న ప్రభుత్వ వెన్నుపోటు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు.

పలువురు ఉపాధికి గండి

రాష్ట్రంలో ఉన్న 64లక్షల పెన్షన్లలో రెండు లక్షలు తొలగించి కూటమి ప్రభుత్వం వృద్ధులకు తీరం అన్యాయం చేసిందని విమర్శించారు. వలంటీర్లతో పాటు రేషన్‌ సరఫరా చేసే వాహనాలను సైతం తొలగించి ఎంతో మంది ఉపాధిని దెబ్బతీసిందని తెలిపారు. అధికారంలోకి వస్తే ఉపాధి కల్పన చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. నేరుగా వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ చేయడం వల్ల ఎంతో మంది ఆర్థిక పరిస్థితులు మెరుగు పడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్‌ డి. సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జయభారతరెడ్డి, నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, జోగి రాజా, చల్లా రామయ్య, నర్రావుల వెంకట్రావు, బంగారురెడ్డి, ఇమ్మడిశెట్టి అంకమ్మ, తన్నీరు అంకమ్మరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement