
ఆరోగ్యానికి సైక్లింగ్
నరసరావుపేట ఈస్ట్: ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్ ఉత్తమ వ్యాయామంగా దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం ఎర్త్ హీరో ఫౌండేషన్ భాగస్వామ్యంతో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. సతైనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డీఎస్ఓ నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రపంచ సైకిల్ దినోత్సవంతో పాటు సండేస్ ఆన్ సైకిల్ నిర్వహించాలని ఆదేశించినట్టు వివరించా రు. శరీరానికి వ్యాయామాన్ని అందించే సైక్లింగ్ను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూ చించారు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఆనంద్ బెంజిమెన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరణ రక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పౌరులకు పరిచయం చేసేందుకే సండేస్ ఆన్ సైకిల్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో స్టేడియం కోచ్లు చావా శ్రీనివాసరావు, మద్దాలి సైదారావు, ఖేలో ఇండియా పీఈ టీ ఇజ్రాయిల్ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఎస్ఓ నరసింహారెడ్డి