
బీచ్ కబడ్డీ పురుషుల జట్టు ఎంపిక
చినగంజాం: 12వ బీచ్ కబడ్డీ స్టేట్ చాంపియన్ షిప్కు ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల తుది జట్టు ఎంపిక బుధవారం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 25 మంది పాల్గొనగా, వారిలో 15 మంది ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. 21 నుంచి 30 వ తేదీ వరకు శిక్షణ నిర్వహించారు. అనంతరం బుధవారం తుది జట్టును ఖరారు చేశారు. జిల్లా జట్టుకు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఎం. గిరిబాబు కోచ్గా వ్యవహరిస్తున్నారు. చినగంజాం ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శీలం రమేష్ విచ్చేశారు. ప్రకాశం జిల్లా పురుషుల జట్టుకు క్రీడా దుస్తులను డాక్టర్ నల్లూరి సుబ్బారావు సమకూర్చగా, క్రీడాకారులకు ఎస్ఐ అందజేశారు. తుది జట్టులో ఆరుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు. మరో ఏడుగురు స్టాండ్ బైగా ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, కార్యదర్శి పూర్ణచంద్రరావులు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మే నెల 2, 3, 4వ తేదీలలో కాకినాడలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలలో ఈ జట్టు పాల్గొంటుందని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పెర్నేటి ప్రకాష్ , సాంబశివరావు, ఎం.గిరిబాబు, పీడీ శివ, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.
జట్టు సభ్యులు వీరే: ఎన్. ఉమామహేశ్వరరావు, బి. సురేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పి. బ్రహ్మారెడ్డి, జి. లక్ష్మారెడ్డి, ప్రసాద్రెడ్డిలను ఎంపిక చేశారు. స్టాండ్బైగా జి.లక్ష్మారెడ్డి, కె.వెంకటేష్ రెడ్డి, పి. బాలకృష్ణారెడ్డి, కె. హరిప్రసాద్రెడ్డి, రామాంజీ తదితర ఏడుగురిని ఎంపిక చేశారు.