
ఉజ్వల భవితకు నవోదయం
మదనపల్లె సిటీ: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత భోజనం,వసతితో అత్యుత్తమ విద్యనందిస్తున్న జవహర నవోదయ విద్యాలయాల్లో అడ్మిష్లకు అవకాశం కల్పించారు. జిల్లాలో మదనపల్లె సమీపంలోని వలసల్లెవద్ద జవహర్ నవోదయ విద్యాలయ, రాజంపేటలోని నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తే 6 వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య చాలా కీలకమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవీన విద్యను అందించాలన్న ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయాలను నెలకొల్పారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 29వతేదీతో గడువు ముగియనుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
దరఖాస్తులు ఇలా...
● జవహర్ నవోదయ విద్యాలయాలకు విద్యార్థులు www.cbseitems.rcl.gov.in/nvs అనే వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మదనపల్లె నవోదయకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట నవోదయకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారై ఉండాలి.
● ప్రవేశపరీక్ష రాయబోయే విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి.
● మదనపల్లె నవోదయ పాఠశాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట నవోదయ పాఠశాలకు ఉమ్మడి కడప జిల్లా ప్రాతిపదికన అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుంటారు.
ఇవీ సౌకర్యాలు: సువిశాలమైన పాఠశాల ప్రాంగణం, శాశ్వత తరగతి గదులు, డిజిటల్ పాఠాలకు ప్రత్యేక ఏర్పాట్లు, ఆధునాతన కంప్యూటర్ ల్యాబ్, బాల,బాలికలకు విడివిడిగా వసతి గృహాలు, ఉదయం యోగా, వ్యాయామం సాధన, కూచిపూడి, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస స్కౌట్స్ అండ్ గైడ్స్ ,పలు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. పాఠ్యాంశాలతో పాటూ విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.
పరీక్ష ఇలా....
పరీక్ష రకం ప్రశ్నల మార్కులు సమయం
సంఖ్య (నిమిషాలు)
రిజర్వేషన్లు ఇలా...
ఎస్సీలకు 15 శాతం
ఎస్టీలకు 7.5 శాతం
దివ్యాంగులు 3 శాతం
బాలికలు 33 శాతం
దరఖాస్తులకు అవకాశం
ఈనెల 29న చివరి గడువు
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
మేథాశక్తి 40 50 60
అంకగణితం 20 25 30
భాషా పరీక్ష 20 25 30
ప్రతిభ ఽఆధారంగానే ప్రవేశాలు
నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. ఎలాంటి సిఫార్సులకు తావుండదు. తల్లిదండ్రులు, విద్యార్థులు అపోహలకు లోనవ్వకుండా అప్రమత్తతతో ఉండాలి. పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ మొత్తం పాదర్శకంగా ఉంటుంది. ప్రవేశం పొందే విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వతరగతి వరకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం సాగించవచ్చు. దరఖాస్తులు గడువులోగా పూర్తి చేసి సద్వినియోగం చేసుకోవాలి. –గీత, ప్రిన్సిపాల్,
జవహర్ నవోదయ విద్యాలయ, మదనపల్లె

ఉజ్వల భవితకు నవోదయం

ఉజ్వల భవితకు నవోదయం