ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి

May 2 2025 1:05 AM | Updated on May 2 2025 1:05 AM

ద్విచ

ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి

మదనపల్లె : ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం వేకువజామున మదనపల్లెలో జరిగింది. నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన చిన్నరాముడు, అరుణ దంపతుల కుమారుడు వెంకటేష్‌(21) కురబలకోట మండలం విశ్వం కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కడప జిల్లా కమలాపురానికి చెందిన వెంకటశివారెడ్డి(23) అదే కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ స్థానికంగా పీజీలో ఉంటున్నారు. గురువారం వేకువజామున ఇద్దరూ కలిసి సొంతపనులపై పలమనేరుకు వెళుతుండగా, మదనపల్లె బైపాస్‌రోడ్డు రాయల్‌ ఉడ్‌ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొన్నారు. ప్రమాదంలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి వెంకటశివారెడ్డి తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి 1
1/2

ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి

ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి 2
2/2

ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement