
అదుపు తప్పి ద్విచక్ర వాహనం బోల్తా
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ మూడవ గేటు వద్ద సోమవారం ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి కిందపడిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం కమ్మపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఎం.సుశాంత్, కల్లూరు కళ్యాణిలు ఇరువురు కడపలోని కళాశాలకు సోమవారం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. వీరు భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ మూడవ గేటు వద్దకు రాగానే బెటాలియన్లో నుంచి ఒక విద్యార్థి సైకిల్పై బయటకు వచ్చాడు. సుశాంత్ అతన్ని తప్పించ బోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న అరుగును ఢీకొని బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో సుశాంత్కు రెండు కాళ్లు విరిగాయి, కళ్యాణి తలకు గాయా లయ్యాయి. వీరిని వైద్యం కోసం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని స్థానికులు తెలిపారు.
ఇద్దరికి గాయాలు