
కస్తూర్బా బాలిక.. విజయగీతిక
మదనపల్లె సిటీ : జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయల (కేజీబీవీ) బాలికలు సత్తా చాటారు. జిల్లాలో 22 కేజీబీవీలు ఉండగా వాటిలో 798 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో 631 మంది పాసై 79 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుల్లో రాణించారు. తమ కుటుంబాల నేపథ్యాలను గుర్తెరిగి మంచి ఫలితాలతో అందరి మన్ననలు పొందుతున్నారు.
నేరవేరుతున్న వైఎస్సార్ కల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నిజమవుతోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన, ఆర్థిక స్థోమత లేకుండా, పేదరికంలో ఉండి చదవాలనే ఆసక్తి ఉన్నా... పరిస్థితులు అనుకూలించని ఎంతో మంది నిరుపేద బాలికలు చదువుకోవాలనే లక్ష్యం ఫలిస్తోంది. నేడు ఎంతో మంది విద్యార్థుఽలు బాగా చదివి... విద్యావంతులై భళా అనిపిస్తున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వాటిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంగ్లీషుమీడియంలో బోధన, అత్యంత భద్రతతో కూడిన వసతి సదుపాయాలు కలిగి బాలికలు విద్యావంతులుగా తయారవుతున్నారు. ఈ విద్యాలయాల్లో సాధారణ విద్యతో పాటు ఆంగ్లమాధ్యమం,యోగా, వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి బాలికలకు చదువుతో పాటు బతుకు దెరువుకు భరసా కల్పిస్తున్నాయి. వై.ఎస్.జగనన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీబీవీలకు లక్షలు ఖర్చు చేసి మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు. పదో తరగతి తర్వాత వారు డ్రాపౌట్స్గా మారేందుకు వీలులేకుండా కేజీబీవీలలో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టి మరో అడుగు ముందుకు వేశారు.
ఇతర కేజీబీవీల్లో ఫలితాలు..
బి.కొత్తకోట కేజీబీవీలో ఎస్.ఫహీనాజుమ్ 544 మార్కులు, వగళ్ల కేజీబీవీలో వై.రేఖ 548, కలకడ కేజీబీవీకి చెందిన ఎం.జయంతి 516, ములకలచెరువు కేజీబీవీకి చెందిన స్నేహలత 488, నిమ్మనపల్లె కేజీబీవీలో వి.తేజస్విని 535, పెద్దమండ్యం కేజీబీవీలో ఎం.మౌనిక 525, పీటీఎం కేజీబీవీలో ఎ.స్నేహలత 459, రామసముద్రం కేజీబీవీలో పుష్పావతి 520, చిట్వేలి కేజీబీవీకి చెందిన హరిత 480, గాలివీడు కేజీబీవీలో డి.ప్రీతి 465, లక్కిరెడ్డిపల్లె కేజీబీవీకి చెందిన పి.కావ్యశ్రీ 480, పెనగలూరు కేజీబీవీలో ఎం.కవిత 515, పుల్లంపేట కేజీబీవీలో పల్లవి 547, రామాపురం కేజీబీవీలో ఆశ 549, రాయచోటి కేజీబీవీకి చెందిన సాయిశ్రీ 539, వీరబల్లి కేజీబీవీల్లో యమున 545 మార్కులు సాధించి ఆయా పాఠశాలల్లో టాపర్స్గా నిలిచారు.
నేటి నుంచి రెమిడియల్ తరగతులు:
జిల్లాలో మూడు సెంటర్లలో రెమిడియల్ తరగతులు సోమవారం నిర్వహిస్తున్నట్లు జీసీడిఓ మధుమతి తెలిపారు. రాయచోటి ప్రాంతానికి గాలివీడు కేజీబీవీ, మదనపల్లె ప్రాంతానికి బి.కొత్తకోట కేజీబీవీ, రాజంపేట ప్రాంతానికి పెనగలూరు కేజీబీవీలో రెమియల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం నిజమవుతోంది. ఏ ఽఆధారం లేని బాలికల చదువు కోసం ఆయన సీఎంగా ఉన్నప్పుడు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు(కేజీబీవీలు) నెలకొల్పారు. వైఎస్సార్ తనయుడు మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో కేజీబీవీలకు కార్పొరేట్ హంగులు సమకూర్చారు. వాటిలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఈ విద్యాలయాలు ఫలితాల్లో సత్తా చాటుతున్నాయి. ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం చూపి భేష్ అనిపించుకున్నాయి.
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
79 శాతం ఉత్తీర్ణత
ప్రథమ స్థానం విద్యార్థినికి 572 మార్కులు
సంతృప్తికర ఫలితాలు
కేజీబీవీల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. 22 కేజీబీవీలో 79 శాతం ఉత్తీరణ సా ధించాం. చాలా మంది విద్యార్థులకు 500 మార్కులుపైగా వచ్చాయి. ఫలితాల పరంగా సంతోషంగా ఉంది.
– సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి.
నిత్యం పర్యవేక్షణ
జిల్లాలోని కలెక్టర్, డీఈఓల సూచనలు, సలహాలు పాటిస్తూ కేజీబీవీలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. స్టడీ అవర్స్, వారాంతం పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మార్కుల సాధనపై దృష్టి పెట్టాం. తక్కువ మార్కులు వచ్చే వారి పట్ల ప్రిన్సిపాళ్లతో ప్రత్యే శ్రద్ధ తీసుకున్నాం. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించాం.
– మధుమతి, జీసీడీఓ, సమగ్రశిక్ష

కస్తూర్బా బాలిక.. విజయగీతిక

కస్తూర్బా బాలిక.. విజయగీతిక