
సబ్ జూనియర్ షూటింగ్బాల్ పోటీలు ప్రారంభం
మదనపల్లె సిటీ : స్థానిక పుంగనూరురోడ్డులోని వశిష్ట స్కూలులో శనివారం 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల షూటింగ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా షూటింగ్బాల్ అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ, వశిష్ట స్కూల్ చైర్మన్ డాక్టర్ పీవీఆర్ గుప్తా ప్రారంభించారు. రాష్ట్ర షూటింగ్బాల్ కార్యదర్శి పరుశురాముడు మాట్లాడుతూ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్టును ఎంపిక చేసి మే 7 నుంచి తమిళనాడు రాష్ట్రంలో జరిగే పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ రాయలసీమ కన్వీనర్ నరేష్బాబు, జిల్లా కార్యదర్శి మురళీధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్ , గురుప్రసాద్, పీడీలు నాగరాజ, భారతి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.