
నిర్మాణాలు పూర్తి చేయాలి
గత ప్రభుత్వంలో ‘నాడు–నేడు’ కింద గ్రామంలో పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. పనులు వేగవంతంగా జరిగాయి. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. అసౌకర్యాల మధ్యనే విద్యార్ధులు చదువుకోవాల్సి వస్తోంది. అర్ధంతరంగా ఆగిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలి.
– దేవరెడ్డి, ఉంతకల్లు గ్రామం,
బొమ్మనహాళ్ మండలం
ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు
గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లోనూ మౌళిక వసతులు కల్పించింది. అదనపు తరగతి గదుల నిర్మాణాలు చాలా స్కూళ్లలో 10–20 శాతం మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడులను అసలే పట్టించుకోలేదు. నిధులు మంజూరు చేస్తే పెండింగ్లో ఉన్న గదులన్నీ అందుబాటులోకి వస్తాయి.
– కుళ్లాయిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి

నిర్మాణాలు పూర్తి చేయాలి