
తాగుడు మానేయమంటే ఉరేసుకున్నాడు
గుంతకల్లు: పాత గుంతకల్లు ప్రాంతానికి చెందిన వడ్దే రంగముని, సుజాత దంపతుల కుమారుడు వడ్దే రాజేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. డెకరేషన్ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచిన రాజేష్... ఏడాదిగా మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న రాజేష్ను తల్లిదండ్రులు మందలించారు. దీంతో అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి సాయంతో రాజేష్ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై గుంతకల్లు రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.