
గాయపడిన మహిళా ఉద్యోగి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య ముకుంద ప్రియ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామ సచివాలయం–2లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. భర్త చంద్రారెడ్డి ఆర్మీకి వెళ్లడంతో కర్నూలులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్న ఆమె రోజూ కర్నూలు నుంచి స్కూటీపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో గత నెల 20న విధులకు వెళ్తుండగా రోడ్డుపై నిలబడిన లారీని ఢీకొని గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందారు.