
అధినేతతో ప్రవాసాంధ్రుల భేటీ
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రవాసాంధ్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి వెంట వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఉన్నారు.
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధులను వైఎస్ జగన్కు ఆయన పరిచయం చేశారు. పార్టీ అధినేతను కలసిన వారిలో ఇలియాస్ (వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్), మర్రి కళ్యాణ్ (కో–కన్వీనర్, కువైట్), జాఫర్ హుస్సేన్ (కో–కన్వీనర్, ఖతార్), వీపీ రామచంద్రారెడ్డి(అడ్వైజర్, కువైట్), గజ్జల నర్సారెడ్డి (అడ్వైజర్, కువైట్), షేక్ సబ్దర్ (ఈసీ, కువైట్), షేక్ ఇలాహి (కమిటీ సభ్యుడు, సౌదీ అరేబియా), చంద్రలేఖ, శ్రీనివాసరెడ్డి (అట్లాంటా, యూఎస్ఏ), సాయికొప్పినేని (మెల్బోర్న్, ఆస్ట్రేలియా) ఉన్నారు.

అధినేతతో ప్రవాసాంధ్రుల భేటీ