
● ఇదేనా సంపద సృష్టి!
గుంతకల్లు: తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టి చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని హామీనిచ్చిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత కంటికి కనిపించని దోపిడీకి తెరలేపారు. ఒకే దూరం.. ఒకే రకమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి రూ.10 వ్యత్యాసంతో చార్జీలు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. గుంతకల్లుకు చెందిన ఓ ప్రయాణికుడు ఆదివారం ఉదయం పల్లె వెలుగు బస్సులో బురుజల మీదుగా 35 కి.మీ. దూరంలో ఉన్న పత్తికొండకు వెళ్లాడు. ఇందుకు గాను టికెట్ ధర రూ.40 చెల్లించాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం సాయంత్రం పల్లె వెలుగు బస్సులోనే బురుజల మీదుగా గుంతకల్లుకు చేరుకున్నాడు. ఇందుకు గాను టికెట్ ధర రూ.50 చెల్లించాడు. ఉదయం రూ.40 తీసుకున్నారు... సాయంత్రం రూ.50 తీసుకుంటున్నారు ఎందుకంటూ కండక్టర్ను నిలదీయడంతో ఉదయం 35 కి.మీ. దూరం ఉందని, సాయంత్రం 40 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోందని కండక్టర్ తెలపడంతో ప్రయాణికులు అవాక్కయారు. ఈ వ్యత్యాసం వెనుక ఉన్న దోపిడీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలని విమర్శలు గుప్పించారు.

● ఇదేనా సంపద సృష్టి!