చోడవరంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం | - | Sakshi
Sakshi News home page

చోడవరంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం

Jun 29 2025 2:39 AM | Updated on Jun 29 2025 2:39 AM

చోడవర

చోడవరంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం

చోడవరం: నియోజకవర్గ కేంద్రం చోడవరంలో ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంభూ విఘ్నేశ్వరస్వామి దేవాలయం సమీపంలో హార్డింజ్‌ గెస్ట్‌ హౌస్‌ ఆవరణంలో 63అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శనివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకూ గ్రామీణ జిల్లాలో ఇంత భారీ మట్టి విగ్రహాన్ని ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహం ఏర్పాటు, ఇతర సెట్టింగ్‌లకు సుమారు రూ. 25లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహం తయారీకి రెండు నెలల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. సద్భావన కమిటీ, చోడవరం కమ్యూనిటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూజా కార్యక్రమాన్ని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ పసుమర్తి సాంబ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గూనూరు మల్లునాయుడు, కొప్పాక రాజేష్‌, గూనూరు పెదబాబు తదితరులుపాల్గొన్నారు.

నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

చోడవరంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం 1
1/1

చోడవరంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement