
కూటమి పాలన.. నయవంచన
బాండ్లపై సంతకం పెట్టారు.. ఇప్పుడేమంటారు?
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి పార్టీలు చేసిన మోసాలను ప్రజల వద్ద ఎండగడతామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అలవి కాని ఎన్నో హామీలు గుప్పించి వాటిపై ఇంటింటికీ హామీలు, సంతకాలతో బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. శనివారం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొత్స సత్య నారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు. ముందుగా మహానేత వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు తదితరులతో కలిసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎన్నికల ముందు త్రికరణ శుద్ధితో అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు చెత్తబుట్టకే పరిమితం చేసిన మేనిఫెస్టోను ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి కూటమి పార్టీల మోసాలు ప్రజలకు వినిపిస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు గురించి చంద్రబాబు ఒకలా.. లోకేష్ మరోలా.. అధికారులు ఇంకోలా ఎవరికి తోచిన విధంగా వారు అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అంటున్నారు.. ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తారో తెలియని పరిస్థితిలో ప్రజలున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యో గాలు లేదా రూ.3 వేల భృతి ఎప్పుడిస్తారో తెలీదు.. ఆడబిడ్డ నిధిని పీ–4కు లింక్ చేశామంటున్నారు.. టీడీపీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మహిళలు, రైతులు మోసపోతూనే ఉంటారన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు విడుదల చేయలేదన్నారు. ఇలాంటి శుష్క వాగ్దానాలను ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తులో ఇవ్వకుండా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరిట ఎన్నికలకు ముందు వారిచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక వారి మోసాలను ఎండగడదామన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి తాటతీస్తామంటున్నారు.. పవన్ కల్యాణ్ అయితే మక్కలు విరగ్గొడతామంటున్నాడు.. ఇచ్చిన హామీ లు నెరవేర్చకపోతే ప్రజలే మీ మక్కలు విరగ్గొడతారని హెచ్చరించారు. అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో ఎంతమందిని పెడతావో పెట్టుకో.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడేదే లేదన్నారు.
నిలదీద్దాం రండి
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో ఇంటికీ రూ.2 లక్షల 40 వేలు జమ అవుతాయని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమ్మించారని, బాండు కూడా రాసిచ్చారని.. ఇప్పుడు వాటిపైనే నిలదీద్దామన్నారు. ఇటీవల ఒక పచ్చ పత్రికలో కొత్త పరిశ్రమలు వచ్చేస్తున్నాయంటూ పెయిడ్ ఆర్టికల్స్
రాయించుకున్నారని,
ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 8 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని అవాస్తవాలు రాయించుకుంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. పొదిలి, పల్నాడు, గుంటూరు పర్యటనల్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూస్తే కూటమి ప్రభుత్వానికి దడ పుడుతోందన్నారు. వచ్చే ఏడో తేదీ నాటికి అన్ని నియోజకవర్గాలల్లో విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి చేయాలన్నారు.
ఏడాది పాలనపై తీవ్ర వ్యతిరేకత
మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. కూటమి పార్టీల మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని ప్రజలంతా ఇప్పటికే పశ్చాత్తాపానికి గురవుతున్నారని చెప్పారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై పెద్దస్థాయిలో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరల నుంచి భూమి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలకు భద్రత లేదు.. చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చుమీరాయన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి మాట్లాడుతూ.. మూడు పార్టీలు ఆరు గ్రూపులుగా కూటమి పాలన సాగుతోందని, ఇసుక నుంచి గ్రావెల్, మద్యం వరకు అన్నీ దోచుకుంటున్నారన్నారు. సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, కన్నబాబురాజు, మలసాల భరత్కుమార్, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, బొడ్డేడ ప్రసాద్, వ్యవసాయ సలహామండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, ముఖ్యనేతలు దంతులూరి దిలీప్కుమార్, చింతకాయల సన్యాసిపాత్రుడు, ఈర్లె అనురాధ, మిలటరీనాయుడు, రుత్తల యర్రాపాత్రుడు, మందపాటి జానకీ రామరాజు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, పుల్లేటి వెంకటేష్, పాలిశెట్టి సురేష్రాజు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
8లో
మిగతా
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం
క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ డౌన్లోడ్
శాసనమండలి విపక్ష నేత బొత్స, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
అమర్నాథ్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఉచిత బస్సు నుంచి గ్యాస్ సిలిండర్ వరకూ హామీలిచ్చి మహిళలను, అన్నదాత సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట యువతను మోసగించారని మండిపడ్డారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛను ఇస్తామని ఇచ్చిన హామీ హుష్ కాకి అయిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎటువంటి షరతులు లేకుండా..అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ సంతకం చేసి బాండ్లు ఇచ్చారన్నారు. అవేవీ నెరవేరక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ వారి పక్షాన నిలబడి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఐదు వారాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి కూటమి పార్టీల మోసాలు ప్రజలకు వివరిద్దామన్నారు.

కూటమి పాలన.. నయవంచన

కూటమి పాలన.. నయవంచన

కూటమి పాలన.. నయవంచన