
వైజాగ్లో..
వందేభారత్ నిర్వహణ డిపో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం విశాఖలో కోచింగ్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా తెలిపారు. రైల్వే యార్డులో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. రైళ్ల నిర్వహణ పనుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు 24 గంటలు ఈ డిపో పనిచేస్తోందన్నారు. దువ్వాడలో వందేభారత్ రైళ్ల స్టాప్ పాయింట్ కోసం వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు వివరించారు. అలాగే విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ నియామకం జరిగిందని, వారి కార్యాలయం కోసం 3, 4 ప్రాంతాలను తాత్కాలికంగా పరిశీలిస్తున్నామన్నారు. విశాఖ నుంచి దువ్వాడ వరకు కొత్త రైల్వే లైను పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పనులకు ఉన్న కోర్టు కేసుల అడ్డంకి తొలగిపోయిందని, ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
మల్లివీడు వద్ద గతి శక్తి టెర్మినల్..!
కొత్తవలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత గల మల్లివీడు రైల్వే స్టేషన్ వద్ద గతిశక్తి టెర్మినల్ (జీసీటీ) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మెకానికల్ హ్యాండ్లింగ్, వేర్ హౌసింగ్, ట్రక్ రిపేర్ సెంటర్, ఫ్యూయలింగ్ సెంటర్ ఏర్పాటుకానున్నాయి. మెకానికల్ హ్యాండ్లింగ్ ద్వారా రేకుల లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం అవుతుంది. తద్వారా రేకుల అందుబాటు సమయం కూడా పెరుగుతుంది. తద్వారా రేకుల కొరత కూడా కొద్ది మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇందుకోసం
ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఆగస్టులో టెండర్ దాఖలుకు గడువు ఉంది. ఇది పూర్తిగా రైల్వే స్థలంలోనే ఏర్పాటు కానుంది.
శాటిలైట్ స్టేషన్లుగా మరింత అభివృద్ధి..!
విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం రోజూ 50 వేల మంది వరకూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే లైన్లు తక్కువగా ఉండటం వల్ల రైళ్ల వేగం కూడా దువ్వాడ నుంచి తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త రైల్వే లైన్ల పనులు సాగుతున్నాయి. 3, 4 రైల్వే లైన్ల పనులు జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దువ్వాడ, పెందుర్తి శాటిలైట్ స్టేషన్లుగా మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా విశాఖ రైల్వే స్టేషన్పై భారం తగ్గుతుంది. ఇప్పటికే దువ్వాడ స్టేషన్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పెందుర్తి స్టేషన్లోనూ అభివృద్ధి పనులు చేపడతాం.
దువ్వాడలో వందేభారత్ స్టాప్ కోసం ప్రతిపాదనలు
ప్రస్తుతం వైజాగ్–సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు రైళ్ల నిర్వహణ సికింద్రాబాద్లోని డిపోలో జరుగుతోంది. విశాఖలో ఈ రైళ్ల నిర్వహణ కోసం డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఈ డిపో పనులు ప్రారంభించాలని నిర్ణయించాం. అదేవిధంగా ఈ రైళ్లును దువ్వాడ స్టేషన్లోనూ నిలపాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉంది. దీనిపై వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
దువ్వాడ నుంచి పలాసకు రయ్.. రయ్!
దువ్వాడ నుంచి పలాస వరకు రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా జారీచేశాం. రానున్న 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించాం. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సందర్భంగా ఎటువంటి ప్రమాదాలకు... రైల్వే లైన్ల క్రాసింగ్కు అవకాశం ఉండదు. తద్వారా రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా ప్రయాణికులు గమ్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
8లో
మిగతా
అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో ఏర్పాటు
విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఇక వేగవంతం
దువ్వాడ–పలాస మధ్య రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్
మల్లివీడు వద్ద పీపీపీ పద్ధతిలో గతి శక్తి టెర్మినల్ ఏర్పాటు
దక్షిణ కోస్తా రైల్వే జీఎం కార్యాలయం కోసం 3, 4 స్థలాల పరిశీలన
‘సాక్షి’తో వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా
రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు..!
కోర్టు కేసుతో రైల్వే స్టేషన్లో పనులు ముందుకు సాగలేదు. చివరకు కోర్టు కేసు గెలిచాం. పనులు ప్రారంభిస్తాం. మొత్తం 14 ఫ్లాట్ఫారంలను ప్రధాన బిల్డింగ్ను ప్రయాణికులు చేరేందుకు వీలుగా 72 మీటర్ల పొడవైన కాంకోర్స్ ఏర్పాటవుతుంది. ఇక్కడ ప్రయాణికులు సేదతీరేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఫ్లాట్ఫారం సైజు కూడా పెరుగుతుంది. ఇక జ్ఞానాపురం వైపు స్టేషన్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ఫారంల నిర్మాణం ఉంటుంది. మల్టీ లెవల్ కారు పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గత 8 నెలలుగా నిలిచిన పనులు పట్టాలెక్కనున్నాయి.

వైజాగ్లో..