
రహదారిపై మద్యం వాహనం బోల్తా
అచ్యుతాపురం రూరల్: అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వస్తున్న మద్యం వాహనం మంగళవారం కొండకర్ల కూడలి సమీపంలో రోడ్డు అడ్డంగా బోల్తా పడింది. ఆవును తప్పించడంలో అదుపుతప్పి వాహనం బోల్తాపడినట్టు సంఘటన స్థలంలో ఉన్న వారు తెలిపారు. బీరు బాటిల్లు, మద్యం సీసాలు కిందపడి పగిలిపోయాయి. ఎంత నష్టం కలిగింది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. రహదారి చిన్నది కావడంతో మితిమీరిన వేగం, అదుపుచేయలేక పోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇష్టారాజ్యంగా వాహనాలు మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాలకు గురౌతున్నారని ప్రజలంటున్నారు.