
సెజ్ పరిశ్రమలకు సమ్మె నోటీసులు
అచ్యుతాపురం రూరల్: దేశవ్యాప్త కార్మిక సమ్మెలో పరిశ్రమల కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని యాజమాన్యాలకు మంగళవారం సిటు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తున్నాయన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఆర్ సత్తిబాబు, సన్యాసిరావు పాల్గొన్నారు.