సెజ్‌ పరిశ్రమలకు సమ్మె నోటీసులు | - | Sakshi
Sakshi News home page

సెజ్‌ పరిశ్రమలకు సమ్మె నోటీసులు

Jun 25 2025 6:52 AM | Updated on Jun 25 2025 6:52 AM

సెజ్‌ పరిశ్రమలకు సమ్మె నోటీసులు

సెజ్‌ పరిశ్రమలకు సమ్మె నోటీసులు

అచ్యుతాపురం రూరల్‌: దేశవ్యాప్త కార్మిక సమ్మెలో పరిశ్రమల కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని యాజమాన్యాలకు మంగళవారం సిటు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, మండల కన్వీనర్‌ కూండ్రపు సోమునాయుడు నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తున్నాయన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌ సత్తిబాబు, సన్యాసిరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement