
లంకెలపాలెం ఘటనలో గాయపడిన కొత్తకోట యువకులు
రావికమతం: లంకెలపాలెం కూడలి వద్ద సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో రావికమతం మండలం కొత్తకోటకు చెందిన ఇద్దరు యువకులు సాలాపు రామ్కుమార్(రాంకీ), (27), తురాల శేషు(26) తీవ్రంగా గాయపడ్డారు. రామ్కుమార్, శేషు ఇద్దరూ నర్సీపట్నం శ్రీరామ్ చిట్స్లో కొంత కాలంగా పనిచేస్తున్నారు. ఇరువురు వాయిదాలు రికవరీ చేయడానికి బైక్పై విశాఖపట్నం వెళ్లి తిరిగి రాత్రి కొత్తకోట వస్తుండగా, లంకెలపాలెం కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగారు. ఆ సమయంలో వెనుక వైపు గాజువాక నుంచి వేగంగా వస్తున్న లారీ సిగ్నల్ వద్ద ఆగకుండా ముందువున్న వాహనాలను తొక్కుకుంటూ దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. బైక్పై ఆగివున్న రామ్కుమార్, శేషులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్కుమార్ కుడి కాలు, నడుముకు, శేషు తలకు, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. రామ్కుమార్ని కేజీహెచ్కు, శేషును మెడికవర్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ అక్కడే వైద్యం పొందుతున్నారు.

లంకెలపాలెం ఘటనలో గాయపడిన కొత్తకోట యువకులు