
అనకాపల్లి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్గా గౌరీ
గోవాడ సుగర్స్ ఎండీగా వెంకటేశ్వరరావు
చోడవరం: గోవాడ సహకార చక్కెర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్గా వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏటి కొప్పాక ఎండీగా పనిచేస్తున్న ఆయనను తాజాగా ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి బదిలీ చేసింది. ఇక్కడ ఎండీగా పని చేసిన వి.వి. సన్యాసిరావును భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి బదిలీ చేశారు.
అనకాపల్లి: ప్రజా రవాణాశాఖ జిల్లా అధికారి కె.పద్మావతి సాధారణ బదిలీల్లో భాగంగా విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ పోస్టు ఖాళీగా ఉంది. ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అనకాపల్లి డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రవిచంద్ర విజయవాడ ప్రజా రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి (అపరేషన్ విభాగంలో) బదిలీపై వెళ్లారు. ఇక్కడకు విశాఖ వాల్తేరు డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న గౌరి ఈనెల 16న బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆమె చెప్పారు.