
రక్తదాత.. సుఖీభవ.!
అనకాపల్లి టౌన్: రక్తదానం...ప్రాణదానంతో సమానం. ఏమీ ఆశించకుండా చేసే ఈ చిన్న దానమే ఏటా లక్షల మందిని కాపాడుతుంది. వైద్య రంగంలో పరిశోధనల మూలంగా ఎన్నో అధునాతన మార్పులు వచ్చినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇంకా కనుగొనలేదు. రక్తం ఒక అరుదైన వనరు. ఇది కృతిమంగా తయారు చేయలేని పదార్థం. కాబట్టి ప్రాణాప్రాయ స్ధితిలో ఉన్న వారిని కాపాడడానికి ఉన్న ఏకై క మార్గం రక్తదానం ఒక్కటే.
రక్తదానం ఎవరు చేయవచ్చు...
కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. బరువు కనీసం 45 నుంచి 55 కిలోలు ఉండాలి. ఒక మనిషి ఒకసారి 350 మిల్లీలీటర్ల రక్తం ఇవ్వవచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు 450 మి.లీ రక్తం ఇవ్వవచ్చు. శరీర ఉష్ణోగ్రత 37 నుంచి 98 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. హృదయ స్పందన 60 నుంచి 100 ఉండాలి. రక్తపోటు 100 నుంచి 140, డయాస్టోల్ 60 నుంచి 90 ఉండాలి. తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ కనీసం 12.5 నుంచి 38 వరకు ఉండాలి. చర్మవాధులు లేని ప్రదేశంలో మాత్రమే రక్త తీయాలి. గుండె, ఊపిరితిత్తులు, పొత్తి కడుపు సర్వసాధారణంగా ఉండాలి.
ఓ నెగిటివ్ గ్రూప్కు డిమాండ్
ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బీ పాజిటివ్, బీ నెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఎనిమిది రక్త గ్రూపులు ఉన్నా.. ఓ నెగిటివ్ చాలా అరుదుగా లభిస్తుంది. సుమారుగా ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది.
రక్తం నిల్వ చేసే ఫ్రీజర్
రక్తదానం..ప్రాణదానంతో సమానం
రక్తానికి ప్రత్యామ్నాయం లేదు..
దానమే మార్గం
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
మనిషికి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్ను.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతోపాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే. ప్రమాదాల్లో గాయాల కారణంగా, రక్తహీనత ఏర్పడినప్పుడు, మహిళల్లో కాన్పు సమయాల్లో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటప్పుడే రక్తదాతల అవసరం ఏర్పడుతుంది. ఒకరి రక్తదానం నుంచి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం మహాదానంగా పరిగణిస్తున్నారు. రక్తదాతా సుఖీభవ అంటున్నారు. శనివారం(జూన్ 14) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

రక్తదాత.. సుఖీభవ.!